ముందస్తు ఎన్నికలకు సిద్ధమే


Posted August 19, 2018 by Jinukala

శాసనసభ, లోక్‌సభకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఒక

 
మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ, లోక్‌సభకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ కల్లా ఓటర్ల జాబితా రూపకల్పనను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును శుక్రవారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దానిపై మరింత స్పష్టతను ఇస్తూ శనివారం మరో పత్రికా ప్రకటనను జారీ చేశారు. జనవరి ఒకటవ తేదీ నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నప్పటికీ ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ, పార్లమెంటు సాధారణ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు తేదీలు ప్రకటిస్తే, అందుకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By manatelangana news
Website http://manatelangana.news/ec-ready-to-hold-simultaneous-assembly-lok-sabha-polls/
Country India
Categories News
Last Updated August 19, 2018