భర్త పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో వివాహిత బలవన్మరణం!


Posted August 20, 2018 by Ramesh476

కట్టుకున్నవాడు కుటుంబ పోషణ పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎపిలోని విజయవాడ వాంబే కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది.

 
అమరావతి: కట్టుకున్నవాడు కుటుంబ పోషణ పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎపిలోని విజయవాడ వాంబే కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లెల దేవి (22), నాగరాజు దంపతులు వాంబే కాలనీ బీ బ్లాకులో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం కాగా సంతానం లేరు. భర్త నాగరాజు పాలిష్‌ పనికి వెళ్లేవాడు. అయితే, గత కొంతకాలంగా మద్యానికి బానిసైన నాగరాజు పనిచేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ విషయమై భార్యభర్తల మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది. భర్తను భార్య ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By Mana Telangana
Website http://manatelangana.news
Country India
Categories News
Tags andhra pradesh , suicide , vijayawada , woman
Last Updated August 20, 2018